- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
క్రైమ్ అనలిటిక్స్ రిపోర్ట్స్పై సీపీ సమీక్ష.. నేరాలు తగ్గించే దిశగా చర్యలు..

దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీజీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు, డీఐలు, ఎస్ఐలు, డీఎస్ఐలు, అన్ని పోలీస్ స్టేషన్లలోని బ్ల్యూ కోల్ట్, పాట్రోల్ మొబైల్, సీసీఎస్, క్రైమ్స్ సిబ్బంది తదితర అధికారులతో మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, పీఎస్ఐఓసి ఏసిపి రవీందర్ ఆధ్వర్యంలో క్రైమ్ అనలిటిక్స్ రిపోర్ట్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ జోన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది నేరాల సంఖ్యను తగ్గించే విధంగా క్రైమ్ అనాలిసిస్, నేరాల అంచనా, నేరాలను ఎలా నిరోధించాలి తద్వారా గస్తీ ఏ విధంగా నిర్వహించాలనే తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నేర నియంత్రణలో తప్పనిసరి అనుసరించవలసిన చర్యలను తీసుకోవాలని సూచించారు. నేరాల పట్ల త్వరగా స్పందించి, కేసు నమోదు చేసి నాణ్యతతో కూడిన దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. క్రైమ్ హాట్ స్పాట్లను ఎలా నియంత్రించాలి, క్రైమ్ ప్రోన్ ఏరియాలను, యాక్సిడెంట్ పోర్న్ ఏరియాలను గుర్తించి నివారణ మార్గాలను చేపట్టడానికి.. వివిధ అప్ప్లికేషన్ ద్వారా నేరాలను నియంత్రించాలని తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో నేర నియంత్రణ కోసం అనుసరించవలసిన, రూట్ కాస్ అనాలిసిస్, రిపోర్ట్ అనాలిసిస్ గురించి పోలీస్ స్టేషన్లలో ఉండే సెక్టార్ డీఐ, డీఎస్ఐ, సెక్టార్ ఎస్ఐలకు, క్రైమ్ సిబ్బందికి నేర నివారణ అంశాలను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా క్రైమ్ అనలిటిక్స్, రిపోర్ట్ వింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిరోజు క్రైమ్ అనాలిసిస్ రిపోర్ట్ తయారు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లకు పంపించి, ఈ రిపోర్టు ఆధారంగా నేర నియంత్రణ చర్యలను చేపట్టడానికి వీలుంటుంద్దన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, డీఐలు, ఎస్ఐ లు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.