- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తెలంగాణలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి : మంత్రి హరీశ్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో : మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణాలతో గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పేద ప్రజలకు ఇది ఆర్థిక భారంతో కూడిన వైద్యం అని, అందుకే సర్కార్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో సిద్దిపేట్, మహబూబ్ నగర్లో గుండె సమస్యలను నిర్ధారించే క్యాత్ ల్యాబ్ లను ప్రారంభిస్తామని తెలిపారు. హై టెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో ట్రు బీమ్ యూనిట్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు ఒక ఛాలెంజ్గా మారిందన్నారు. కేన్సర్ కేసులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలన్నారు. బిల్లులు చెల్లింపుల గురించి ఎలాంటి ఆందోళన వద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో ప్రైవేట్ హాస్పటల్కు చెల్లిస్తున్నదన్నారు. ప్రజల వైద్యం కోసం ప్రభుత్వం రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. ఈ నెలలోనే 8 మెడికల్ కాలేజీలు ఒకే రోజున ప్రారంభించు కోబోతున్నామన్నారు. దీనితో రాష్ర్టంలో ప్రభుత్వ పరిధిలోని మెడికల్ కాలేజీకి సంఖ్య 17 కు చేరుకుంటుందన్నారు. కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల విస్తరణ జరుగుతున్నదని మంత్రి చెప్పారు. మానవత్వంతో, ప్రేమతో ప్రజలకు సేవ చేయాలని డాక్టర్లకు సూచించారు.