ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

by Disha Web Desk 1 |
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు హిందుత్వ మనోభావాలు అనుగుణంగా వ్యహరించకుండా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. 500 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం దేశంలో హిందువుల ఆకాంక్ష రేపటితో నెరవేరతోందని పేర్కొన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రోజున ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయని ఫైర్ అయ్యారు. దేశంలోని కోట్లాది మంది ప్రతినిధిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటుంటే కనీసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

Next Story

Most Viewed