- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇదేం పరిపాలన సీఎం గారు! ఆకునూరి మురళి ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో నెలకొన్న రోడ్ల పరిస్థితులపై ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో ఆర్ అండ్ బీ శాఖ పని చూడండి అంటూ ఖమ్మం నుండి కొత్తగూడెం వరకు అధ్వాన స్థితిలో ఉన్న రోడ్ల ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు రహదారుల ప్రధాన ఇంజనీర్ రవీందర్ రావు(వెలమ) 2016 లో రిటైర్ అయ్యారని.. .తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనే సీఈగా ఉంటాడట అంటూ ఐఏఎస్ మాజీ అధికారి ఆరోపించారు. ఈ విధంగా రోడ్లు ఉంటే ప్రాణాపాయ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని మురళి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ తరుణంలో గతుకుల రోడ్లు తప్పవా మాకు.. కనీసం రోడ్లను కూడా మానేజ్ చెయ్యడం చేత కాదా ? ఇదేం పరిపాలన సీఎం గారు అంటూ కేసీఆర్పై మురళి విమర్శలు గుప్పించారు.
బంగారు తెలంగాణ లో R&B శాఖ పని చూడండి. ఖమ్మం నుండి కొత్తగూడెం రోడ్ లో గుంతలు.
— Murali Akunuri (@Murali_IASretd) November 9, 2022
రవీందర్ రావు(వెలమ) ప్రధాన ఇంజనీర్ 2016 లో రిటైర్ అయిండు. CE గా until further orders ఆయనే ఉంటాడట. గతుకుల రోడ్లు తప్పవా మాకు. ఇంత technology ఉన్నా కూడా రోడ్లు manage చెయ్యడం చేత కాదా ?
ఇదేం పరిపాలన CM గారు pic.twitter.com/CokaS8qCMn