- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో ముస్లింలు అనాథలయ్యారు.. మాజీ మంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: ముస్లింలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో ముస్లింలు అనాథలు అయ్యారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబాన్ని కక్ష కట్టి ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మసీదులు కూలగొట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం అర్థరహితమని అన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మతతత్వ బీజేపీకి మద్దతు ఇవ్వదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలత ఏం మాట్లాడుతారో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. లౌకికవాదాన్ని పాటించేది ఎప్పటికీ ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని అన్నారు. కాగా, ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీకొట్టిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో షకీల్ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇదిలా ఉండగానే గతంలో షకీల్ కొడుకుపై నమోదైన మరో కేసును సైతం పోలీసులు ఇటీవల రీ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో మహమూద్ అలీ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి