బాచుపల్లి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఈటల రాజేందర్

by Disha Web Desk 12 |
బాచుపల్లి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఈటల రాజేందర్
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి హరిజన్ రిజ్ కన్స్ట్రక్షన్ లో జరిగిన దురఘటనపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి.. పక్కనే కార్మికులు నివసిస్తున్న గుడిసెల మీద పడడంతో.. ఒరిస్సా ఛత్తీస్గఢ్ చెందిన ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్ మృతి చెందిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, త్వరగా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. గాయపడిన వారికి అపార్ట్మెంట్ వారే చికిత్స చేయించాలి. అపార్ట్మెంట్ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Next Story

Most Viewed