- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఉత్తమ్ మాటలు ఉత్తవే.. సివిల్ సప్లై శాఖలో రూ.100ల కోట్ల స్కామ్ వాస్తవం: MLA ఏలేటి
![ఉత్తమ్ మాటలు ఉత్తవే.. సివిల్ సప్లై శాఖలో రూ.100ల కోట్ల స్కామ్ వాస్తవం: MLA ఏలేటి ఉత్తమ్ మాటలు ఉత్తవే.. సివిల్ సప్లై శాఖలో రూ.100ల కోట్ల స్కామ్ వాస్తవం: MLA ఏలేటి](https://www.dishadaily.com/h-upload/2024/05/21/336607-mla-alleti-maheshwar-reddy.webp)
దిశ, వెబ్డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి ఉత్తమ్ యూ ట్యాక్స్ వసూల్ చేస్తున్నాడని, సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల అవినీతి చేశారని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తుండగా.. అదే రేంజ్లో ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని.. ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఉత్తమ్ కామెంట్స్కు తాజాగా మహేశ్వర్ రెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తవేనని ఎద్దేవా చేశారు. పౌర సరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని మరోసారి ఏలేటీ ఆరోపించారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రూ.100ల కోట్ల స్కామ్ జరిగింది వాస్తవమని మరోసారి నొక్కి చెప్పారు. తాను అడిగిన 19 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానాలు దాటవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.