సాలర్‌పురియా సత్వ స్థిరాస్తి సంస్థపై ఈడీ దాడులు

by Nagaya |
సాలర్‌పురియా సత్వ స్థిరాస్తి సంస్థపై ఈడీ దాడులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఐటీ, ఈడీ జాయింట్ ఆపరేషన్ కలకలం రేపుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో దర్యాప్తు సంస్థల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇంటి తాళాలు పగులకొట్టి మరి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని సాలర్‌పురియా సత్వ స్థిరాస్తి సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. సంస్థకు చెందిన 316 బ్యాంకు ఖాతాలలోని రూ.49.99 కోట్లు సీజ్ చేశారు. ఈ దాడుల్లో రూ.29 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. మనీలాండరింగ్ చట్టం కింద డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. కాగా, సంస్థకు చెందిన టెక్నో క్రాఫ్ట్స్‌కు రూ.41 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అధికారులు గుర్తించారు. సోదాల సమయంలో మరికొన్ని షెల్ కంపెనీలను ఈడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. సంస్థకు చెందిన నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి తిరిగి సాలర్‌పురియాకు బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సాలార్పురియా సంస్థను విజయ్ కుమార్, ప్రదీప్, అశ్విన్‌లు నిర్వహిస్తు్న్నారు. అయితే, వారెవరు లావాదేవీల వివరాలను వెల్లడించలేదని ఈడీ అధికారులు అన్నారు. మనీ లాండరింగ్‌లో హీరా గ్రూప్ భాగస్వామ్యం అయినట్లు గుర్తించారు. అలాగే విదేశాలకు గ్రానైట్ ఎగుమతులపైనా ఈడీ ఆరా తీస్తుంది.



Next Story

Most Viewed