మంత్రి గంగుల ఇంట్లో ఈడీ రైడ్స్.. హుటాహుటిన దుబాయ్ నుండి పయనం..?

by Satheesh |   ( Updated:2022-11-09 09:22:22.0  )
మంత్రి గంగుల ఇంట్లో ఈడీ రైడ్స్.. హుటాహుటిన దుబాయ్ నుండి పయనం..?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రానైట్ వ్యాపార సంస్థలే లక్ష్యంగా రాష్ట్రంలో ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ అపరేషన్ చేపట్టారు. హెదరాబాద్, కరీంనగర్‌లోని పలు గ్రానైట్ వ్యాపారుల ఇండ్లు, కార్యాలయాలపై అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్‌లోని గంగుల కమలాకర్ ఇంటితో పాటు ఆయనకు చెందిన పలు గ్రానైట్ కంపెనీల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ దాడుల సమయంలో మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువులు ఇళ్లలో లేకపోయినప్పటికీ అధికారులు తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంత్రి గంగుల ప్రస్తుతం తెలంగాణలో లేరని సమాచారం. ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారని.. ఈడీ రైడ్స్ విషయం తెలుసుకుని గంగుల హుటాహుటిన తెలంగాణకు పయనమైనట్లు సమాచారం. మంత్రి గంగుల ఇంట్లో ఈడీ రైడ్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గంగుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ రైడ్స్ జరగుతుండటంతో.. ఆయనతో గ్రానైట్ వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ధృవీకరించలేదు.



Next Story

Most Viewed