టీజీపీఏలో సైబర్ షీల్డ్ ల్యాబ్ ప్రారంభించిన డీజీపీ

by Mahesh |
టీజీపీఏలో సైబర్ షీల్డ్ ల్యాబ్ ప్రారంభించిన డీజీపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్ బివీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీజీటీఏ)లో సైబర్ షీల్డ్ ల్యాబ్ ను తెలంగాణ డీజీపీ డా. జితేందర్ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ ఆధునిక పోలీస్ వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. సైబర్ షీల్డ్ ల్యాబ్ అభివృద్ధి చెందుతున్న సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంలో అవసరమైన నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా సైబర్ షీల్డ్ ల్యాబ్ పనిచేస్తుందన్నారు. . సైబర్ షీల్డ్ ల్యాబ్ ఏర్పాటుతో తెలంగాణ పోలీసులు తమ పౌరులకు సేఫ్టీ డిజిటల్ అట్మాస్పియర్ అందించడంలో ముందడుగు వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిష్, జాయింట్ డైరెక్టర్ డి. మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సి. నర్మద, అకాడమీలోని అసిస్టెంట్ డైరెక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story