- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Bandi Sanjay Kumar పాదయాత్ర ప్రారంభోత్సవానికి కీలక నేత!
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నవంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. బాసర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన బైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కారణంగా ప్రారంభోత్సవ సభకు కేంద్ర మంత్రుల, జాతీయ స్థాయి నేతలు దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ సభకు రానున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఐదో విడత పాదయాత్ర ముగింపు సభ కరీంనగర్ లో ఉంటుంది. సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజల్లో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీని అధికారం వైపు నడిపించే దిశగా బండి సంజయ్ ఫిఫ్త్ ఫేజ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.
- Tags
- bandi sanjay