- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ధాన్యం కొనుగోలులో జాప్యం.. వడ్ల పైసలొస్తలేవ్!
దిశ, రంగారెడ్డి బ్యూరో: ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు ధాన్యం అమ్ముకోవాలంటే సవాలక్ష రూల్స్ అడ్డొస్తున్నాయి. వరి ధాన్యం కోనుగోలు చేసుకునేందుకు అనేక నిబంధనలు పెడుతున్నాయి. ఈ నిబంధనలతో రైతులకు సకాలంలో నగదు రాక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాల పేరుతో 22 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ రైతు ఆవేదన మాత్రం వారికి అర్థం కావడం లేదు. చేతికొచ్చిన పంట సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో వారు నష్టపోతున్నారు. వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. తేమ శాతం అధికంగా ఉందనే సాకుతో పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక వైపు చేతికొచ్చిన పంటకు తగిన స్ధాయిలో ధర వస్తుందో రాదో... వచ్చిన నగదుతో కూలీల, పెట్టుబడి ఖర్చులకు వస్తాయో రావో అనే అనుమానంతో బిక్కుబిక్కుమంటూ నెట్టుకొస్తున్నారు. ఈ రైతులకు బరోసా కల్పించే నాథుడే లేకపోవడం గమనార్హం.
అందుబాటులోనే గన్నీ బ్యాగులు