33 జిల్లాల్లో బీజేపీ నేతలపై పరువు నష్టం దావా.. MLC Kavitha

by Disha Web Desk 7 |
33 జిల్లాల్లో బీజేపీ నేతలపై పరువు నష్టం దావా.. MLC Kavitha
X

దిశ, డైనమిక్ బ్యూరో : బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసింది. బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కవిత ఫిర్యాదు చేసింది. పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కవిత తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ కవిత స్పష్టం చేసింది.


Next Story

Most Viewed