- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఆన్లైన్క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్న గ్యాంగ్ను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్పోలీసులు శుక్రవారం అరెస్ట్చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బర్కత్పురాకు చెందిన వికాస్అగర్వాల్(40) గతంలో గుర్రప్పందాల బుకీగా పని చేసేవాడు. అయితే, చేస్తున్న పని నుంచి ఆశించినంత ఆదాయం రాకపోవటంతో ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు. వీటి నుంచి బయట పడటానికి ఆన్లైన్లో క్రికెట్బెట్టింగ్నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ముంబయికి చెందిన సాగర్అనే వ్యక్తిని కలిసాడు. అతని వద్ద నుంచి వేరే దేశం ద్వారా నడుస్తున్న రాధే అనే వెబ్అప్లికేషన్ను అద్దెకు తీసుకున్నాడు. ఆ తరువాత గోషామహల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అదే ప్రాంతానికి చెందిన మహేందర్పటేల్, రాజేందర్పటేల్ను తనతో చేర్చుకుని బెట్టింగులు నిర్వహించటం మొదలు పెట్టాడు. ఇటీవల జరిగిన ఇండియా...న్యూజీల్యాండ్మూడో టీ 20 మ్యాచ్పై కూడా బెట్టింగులు తీసుకున్నాడు. వీటికి సంబంధించిన డబ్బులు వసూలు చేస్తుండగా దక్షిణ మండలం టాస్క్ఫోర్స్పోలీసులు, షా ఇనాయత్గంజ్పోలీస్స్టేషన్సిబ్బందితో కలిసి అరెస్ట్చేశారు. నిందితుల నుంచి 12లక్షల నగదు, 4సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కంటి వెలుగు సిబ్బందిని అభినందించిన డీజీపీ
డీజీపీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్శుక్రవారం అభినందించారు. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ డీహెచ్ఎంవో డాక్టర్వెంకట్ఆధ్వర్యంలో 15మంది వైద్యుల బృందం గత నెల 25 నుంచి డీజీపీ కార్యాలయ సిబ్బందికి నేత్ర పరీక్షలు జరిపారు. మొత్తం 1152 మంది ఉద్యోగులకు పరీక్షలు జరిపి 515 మందికి రీడింగ్గ్లాసులు, 326 మందికి రిఫరల్కళ్లద్దాలను అందచేయనున్నట్టు శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో డాక్టర్వెంకట్చెప్పారు. ఈ క్రమంలోనే డీజీపీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ సంజయ్కుమార్జైన్, డీఐజీ రమేశ్రెడ్డి పాల్గొన్నారు.