బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్! పీడీ యాక్ట్ ను కొట్టివేసిన హైకోర్టు

by Nagaya |   ( Updated:2022-11-09 12:56:02.0  )
బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్! పీడీ యాక్ట్ ను కొట్టివేసిన హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ)యాక్ట్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే కారణంతో గత ఆగస్టు 25న నగర పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేశారు. 2004 నుంచి నేరచరితుడైన రాజాసింగ్ పై ఇప్పటి వరకు 101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 18 మతపరమైన నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. దాంతో పాటు ఇటీవల కాలంలో నమోదైన కేసుల వివరాలను నగర పోలీసు విభాగంలోని పీడీ సెల్ అధ్యయనం చేసి కీలక సమాచారాన్ని సేకరించి చివరకు ఆగస్టులో పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ కమిటీ సమర్ధించింది.

ఈ నేపథ్యంలో తన భర్తపై పోలీసులు పెట్టిన పీడీ యాక్ట్ ను రాజాసింగ్ భార్య ఉషాభాయి హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేయగా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ తరపు న్యాయవాది రవిచందర్ వాదనలు వినిపిసించారు. ఈ సందర్భంగా పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులను కొట్టివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను రవించదర్ ప్రస్తావించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రాజాసింగ్ పై నమోదు చేసిన పీడీ యాక్ట్ ను ఎత్తివేసింది. దీంతో ఆయన ఇవాళ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాజాసింగ్ ను హైకోర్టు షరతులు విధించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, విడుదల సమయంలో ర్యాలీలు నిర్వహించవద్దని సూచించిది. రాజాసింగ్ పై నమోదైన పీడీ యాక్ట్ ను కోర్టు ఎత్తివేయడంతో బీజేపీ అధిష్టానం సైతం ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Read more:

రెండో శనివారం సెలవును రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం



Next Story