CM Revanth Reddy : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్

by M.Rajitha |   ( Updated:2025-04-23 11:35:00.0  )
CM Revanth Reddy : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : తనపై విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్ట్ సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్స్ ను పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

కాగా ఈ కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, విచారణ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. కాగా ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.



Next Story

Most Viewed