- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు.. CM రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. తెలంగాణలో సమస్యలపై డిమాండ్లు పరిష్కరించాలని అడిగితే బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని ఇటీవల కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద ప్రదర్శన చేశారు. తాజాగా బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా తెలంగాణ అడిగితే బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని రాష్ట్రం అడిగితే బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ అడిగితే బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. కృష్ణా, గోదావరి వాటాల పంపకం తెలంగాణ అడిగితే బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. మేడారం జాతరకు జాతీయ హోదా అడిగితే కేంద్రంలోని బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీయే అడ్డు.. పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు.