- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్నాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు.. మోడీపై రేవంత్ మాస్ సైటెర్స్
దిశ, వెబ్డెస్క్: పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిందేమి లేదని.. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. మోడీ కర్నాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని సెటైర్ వేశారు. మాయ మాటలతో బీజేపీ తెలంగాణను వంచిస్తోందని ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన స్థితికి బీజేపీ వచ్చిందని విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం బీజేపీ రాముడిని కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట బహిరంగా సభ నిర్వహించింది.
ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షనస్ సెమీ ఫైనల్ అని.. సెమీస్లో కేసీఆర్ను చిత్తుచిత్తుగా ఓడించారు.. ఇప్పుడు ఫైనల్లో ప్రధాని మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదేళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమి లేదని విమర్శించారు. తెలంగాణను పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానించారని.. ఆ సమయంలో బండి సంజయ్ సభలోనే ఉన్నారని.. మోడీ రాష్ట్రాన్ని అవమానిస్తుంటే చూస్తూ కుర్చుకున్నారు తప్ప ఏమి అనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.