జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

by Mahesh |
జపాన్‌ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జపాన్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలు దేరిన బృందం.. ఈ రోజు మధ్యాహ్నం నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (Industrial Expo) లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం (Meeting with industrialists) జరగనుంది.

జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం (CM team) అధ్యయనం చేయనుంది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ (Skill University in Telangana) కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించనున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed