CM రేవంత్, ఎమ్మెల్యేల మేడిగడ్డ విజిట్.. పోలీసులు అలర్ట్

by Rajesh |
CM రేవంత్, ఎమ్మెల్యేల మేడిగడ్డ విజిట్.. పోలీసులు అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. అయితే ఇందుకు గాను 4 బస్సులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో 4 బస్సులను ప్రభుత్వంగా రెడీగా ఉంచింది. ఇక భద్రతా కోసం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో బస్సులను పోలీసు అధికారులు తనిఖీ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిసరాల్లో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని కాంగ్రెస్ బృందం పరిశీలించనుంది. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. హన్మకొండ జిల్లాలో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల పర్యటన దృష్ట్యా అలర్ట్ అయ్యారు. పరకాలలోని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూనిర్వాసితులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.



Next Story

Most Viewed