పేద విద్యార్థులకు సీఎం KCR శుభవార్త..

by Disha Web Desk 19 |
పేద విద్యార్థులకు సీఎం KCR శుభవార్త..
X

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరులో కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రమే భేష్ అన్నారు. ఏడేళ్ల క్రితం తెలంగాణలో 60 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పడు 3లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నామని కేసీఆర్ తెలిపారు. గతంలో తెలంగాణలో భయంకరమైన వ విద్యుత్ సమస్యలు ఉండేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని పేర్కొన్నారు.

ఏ తెలంగాణ కోసం పోరాడామో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గురుకులాలను మరిన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. చాలా కష్టపడి కంటి వెలుగు కార్యక్రమాన్ని తెచ్చామని.. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదన్నారు. కంటి వెలుగు ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసే తెచ్చిందని స్పష్టం చేశారు.



Next Story