- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రంగంలోకి గులాబీ బాస్.. వచ్చి రావడంతోనే బిగ్ స్కెచ్
దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ బాస్, మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో ప్రత్యేకంగా భేటీ అయిన కేసీఆర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాశం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు గులాబీ క్యాంపస్ లో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం దాంతో వారంతా పార్టీ మారబోతున్నరన్న చర్చ జోరందుకున్న వేళ నిన్నటి సమావేశంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ వినిపిస్తోంది. ఈ భేటీలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదంటూనే ప్రభుత్వం ఉంటుందా? ఉండదా అనేది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదని ఇప్పటికే పార్టీలోని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తుండగా తాజాగా కేసీఆర్ సైతం అదే మాటను పార్టీ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారనే పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ గా మారింది.