BREAKING: తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిన కాంగ్రెస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిన కాంగ్రెస్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా కాంగ్రెస్ మార్చేసిందంటూ కేంద్ర హోంమత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్దిపేటలో నిర్వహించి విశాల జనసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం వ్యాప్తంగా ఉన్న జఠిలమైన సమస్యలకు కూడా తన ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు. 500 ఏళ్ల తరువాత అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370‌ని రద్దు చేశామని అన్నారు. సాధ్యం కాని హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్న ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా తెలంగాణ‌ను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫండ్ అంతా తెలంగాణ నుంచి వెళ్తోందని ఆరోపించారు. మరోసారి మోడీ ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి అనేది లేకుండా చేస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగనే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తామని అన్నారు. మెదక్‌లో రఘునందన్‌తో పాటు, రాష్ట్రంలో కనీసం 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని.. సమగ్ర తెలంగాణ వికాసం కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని అమిత్ షా అన్నారు.



Next Story

Most Viewed