- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవిష్యత్తు బీజేపీదే.. బైపోల్లో కేసీఆర్పై ప్రజల అసంతృప్తి : తరుణ్ చుగ్

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే.. రాష్ట్ర భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్లు స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కంచుకోట లాంటి మునుగోడులో ఆ పార్టీ గెలుపు సంగతి అంటుంచితే, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదంటే రాష్ట్రంలో టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టమవుతోందన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీ లు, పది మంది ఎంపీలు మొత్తం మునుగోడులో మోహరించిన పదివేల మెజారిటీ మాత్రమే వచ్చిందని ఎద్దేవ చేశారు. అంతే కాకుండా కేసీఆర్ రెండు బహిరంగ సభలు, మొత్తం పోలీస్ వ్యవస్థను దించినప్పటికి ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేసేందుకు ముందుకురాలేదన్నారు.
పథకాలు రాకుండా చేస్తామని ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురిచేయడం, అనేక దాడులకు పాల్పడి తప్పుడు కేసులు బనాయించినప్పటికీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోందని విమర్శించారు. మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం సహా మునుగోడు ప్రజలకు అనేక హామీలను గుప్పించి మంత్రులు ప్రచారం చేసిన చోటా బీజేపీ ఆధిక్యం సాధించడం చూస్తే టీఆర్ఎస్ పట్ల ప్రజలకున్న అపనమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. టీఆర్ఎస్ మొత్తం అధికారాన్ని ఉపయోగించినా కూడా స్వల్ప మెజారిటీతో సాంకేతిక విజయం సాధించిందని, నైతిక విజయం మాత్రం బీజేపీ దేనని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ పై, ఎన్నికల గుర్తులపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. సీఎంతో సహా మునుగోడు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ తమ తమ హామీలను నిలబెట్టుకోవాలని, 15 రోజుల్లో చేస్తామన్న అభివృద్ధిని చేసి చూపించాలని డిమాండ్ చేశారు.