BREAKING: వెనుకంజలో బీజేపీ ఎంపీలు

by Satheesh |
BREAKING: వెనుకంజలో బీజేపీ ఎంపీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలు సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అసెంబ్లీకి పోటీ చేయాగా వీరు ప్రస్తుతం లీడ్‌లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగగా ఆయన సైతం గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అసెంబ్లీ బరిలో నిలిచారు. బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్ లు పోటీ చేయగా ఈ ముగ్గురు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.



Next Story

Most Viewed