- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు నుంచి విడుదల

దిశ వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Bjp Mla Raja Singh) చర్లపల్లి జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయనపై ఉన్న పీడీ యాక్ట్ను హైకోర్టు (High Court) కొట్టివేయడంతో పాటు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాజాసింగ్ జైలు (Jail) నుంచి విడుదల అయ్యారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మాత్రమే రాజాసింగ్ను కలిశారు. జైలు వద్ద రాజాసింగ్ను కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారెవరూ కలవకూడదన్న హైకోర్టు ఆదేశాలతో బీజేపీ నేతలు ఎవరూ కూడా ఆ వైపు వెళ్లలేదు. అటు రాజాసింగ్ కూడా ఎలాంటి కామెంట్స్ చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి బయల్దేరి వెళ్లారు.
కాగా ఆగస్టు 25న పీడీ యాక్ట్పై రాజాసింగ్ జైలుకు వెళ్లారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. తాజాగా రాజాసింగ్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పీడీయాక్ట్ ఎత్తివేయడంతో పాటు 3 నెలల పాటు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టొద్దని ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని సూచించింది. ఈ మేరకు రాజాసింగ్ జైలు నుంచి సైలెంట్గా ఇంటికి వెళ్లిపోయారు.