- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటింది: ఈటల రాజేందర్

X
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ నైతికవిజయం సాధించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో అన్నారు. అలాగే కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ సత్తా చాటిందని చెప్పుకోచ్చారు. అలాగే మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులంతా వాలిపోయారని.. మంత్రులు ఇన్చార్జులుగా ఉన్న గ్రామాల్లో బీజేపీకే మెజారీటి వచ్చిందని ఈటల అన్నారు. అలాగే టీఆర్ఎస్ పక్కా ప్లాన్తో ఎంతో కసితో బీజేపీపై దాడులకు పాల్పాడ్డారని ఈటల అన్నారు.
ఎన్నికల టైమ్లో గెలుపు కోసం కేసీఆర్ ఎంతకైన దిగజారుతారని విమర్శలు గుప్పించారు. అలాగే 35 వేల యాదవుల ఓట్ల కోసం వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేశారన్నారు. 8 ఏళ్లుగా కమ్యూనిస్టులకు కనీసం అపాయింటంట్మెంట్ కూడా ఇవ్వలేదని.. ఇప్పడు ఓటమి భయంతోనే వారిని మచ్చిక చేసుకున్నాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Next Story