- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే చివరి తేదీ..!

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,644 సివిల్ పోస్టులతో పాటు, 63 ట్రాన్స్పోర్ట్, 614 కానిస్టేబుల్ పోస్టులకు ఆగస్ట్ 28న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ ఇటీవల విడుదల చేసింది. కాగా, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీ రాత్రి 10గంటల వరకు అవకాశం కల్పించింది. రేపటితో ఆ గడువు ముగుస్తున్నప్పటికీ.. ఇప్పటికి చాలా మంది అభ్యర్థులు ఇంకా పార్ట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయలేదు.
అయితే, పార్ట్ అప్లికేషన్కు నాన్ క్రిమిలేయర్, క్యాస్ట్, స్టడీ కండక్ట్, మెమో వంటి సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంది. దీంతో నాన్ క్రిమిలేయర్, క్యాస్ట్ మొదలైన సర్టిఫికేట్ల కోసం అభ్యర్థులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల లేకపోవడం, ఉన్నప్పటికీ సర్టిఫికేట్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రేపటితో గడువు ముగుస్తుండటంతో దరఖాస్తు తేదీని పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. అధికారులు అందుబాటులో ఉండకపోవటంతో తమ ఏళ్ల కల వృధా అవుతోందని.. పార్ట్ 2 అప్లికేషన్ తేదీని పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఇదిలా ఉంటే, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి.. ఇప్పటి వరకు పార్ట్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయని అభ్యర్థులకు టీఎస్ఎల్పీఆర్బీ మెసేజ్లు పంపుతోంది. పార్ట్ అప్లికేషన్ ఇంకా పూర్తి చేయలేదని.. నవంబర్ 10 తేదీ లోపు పూర్తి చేయాలని మెసేజ్లో సూచించింది. కాగా, అభ్యర్థులు చివరి రోజు వరకు ఆగకుండా తర్వగా పార్ట్ 2 దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడమే ఉత్తమం. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో పాటు.. చివరి రోజు ఎక్కువ మంది అప్లికేషన్ చేసే అవకాశం ఉండటంతో సైట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కావున చివరి వరకు వెయిట్ చేయకుండా.. వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడమే బెస్ట్.