- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
SCR నూతన జీఎంగా అరుణ్ కుమార్ జైన్..

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వుల మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్గా అరుణ్ కుమార్ జైన్ సోమవారం పదోన్నతి పొందారు. ఇదివరకు ఆయన దక్షిణ మధ్య రైల్వేలో ఇంచార్జి జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎస్ఏఈ) 1986 బ్యాచ్కి చెందినవారు. గోరఖ్ పూర్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని, ఖరగ్ పూర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ మాస్టర్స్ డిగ్రీ పొందారు. దక్షిణ మధ్య రైల్వేలో అదనపు జీఎంగా, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజనీర్గా, హైదరాబాద్ డివిజన్ డివిజినల్ మేనేజర్గా విధులు నిర్వహించారు.
డీఆర్ఎంగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో ఆయన డివిజన్లోని వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం వసతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఆధ్వర్యంలో భద్రత రంగాల్లో నాలుగు అత్యంత ప్రతిభ సామర్థ్య అవార్డులను డివిజన్ సాధించింది. దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జీఎంగా పనిచేసిన కాలంలో, సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్ - కాజీపేట - బల్హర్షా, కాజీపేట - కొండపల్లి, విజయవాడ డివిజన్లోని గూడూరు, రేణిగుంట – గుంతకల్ – గుంతకల్ డివిజన్లోని వాడి సెక్షన్తో సహా ఎస్సీఆర్ రైల్వే మొత్తం హై-డెన్సిటీ మార్గంలో గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగాన్ని సాధించడంలో జోన్ గణనీయమైన వృద్ధిని సాధించింది.