- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నర్సులకు మరో చిక్కు.. సీనియర్లకు నష్టం జరుగుతుందని ఆవేదన!
దిశ, తెలంగాణ బ్యూరో: నర్సులకు మరో చిక్కు వచ్చింది. ఇటీవల విడుదల చేసిన 5,204 మంది భర్తీలో అకడమిక్ వెయిటేజీ క్లోజ్ చేశారు. ఫస్ట్ టైమ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో తాము నష్టపోతున్నామని సీనియర్ నర్సులు చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర మెడికల్ సంస్థల్లో పనిచేసే వాళ్లే ఎక్కువగా నష్టపోతున్నామని ఓ నర్సు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి రిక్వెస్ట్చేసినా, స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు నష్టం జరిగే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
ఏమిటీ ఈ మార్కులు..? నష్టం ఎవరికి..?
మెడికల్అండ్హెల్త్ సర్వీసెస్రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 5204 నర్సుల పోస్టుల భర్తీ ప్రాసెస్జరుగుతున్నది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎగ్జామ్నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 80 మార్కులకు ఉండే ఈ పరీక్ష కొరకు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లలో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే అకడమిక్వెయిటేజీ లేదని అధికారులు చెబుతున్నారు. అంటే నర్సింగ్ విద్య పూర్తైన తర్వాత ఏడాదికి ఒక మార్కు చొప్పున ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకుంటూ గరిష్టంగా పది మార్కులు గతంలో ఇచ్చారు. ఈ రూల్ ఇప్పుడు ఎత్తేశారు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్వాళ్లకు సర్వీస్ కోటా కింద వెయిటేజ్ఇవ్వనున్నారు.
దీని వలన ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే నర్సులకు రెగ్యులర్భర్తీలో ఎక్కువ నష్టం జరిగే ఛాన్స్ ఉన్నదని నర్సింగ్ యూనియన్లు చెబుతున్నాయి.టీఎస్పీఎస్సీ గతంలో 1800 పోస్టుల భర్తీ సమయంలో రెండు విధానాలుగా వెయిటేజీ ఇచ్చినట్లు నర్సులు పేర్కొంటున్నారు. అకడమిక్ తో పాటు కాంట్రాక్ట్పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ కలిపారు. కానీ ఇప్పుడు ఈ రూల్ తొలగించడంపై తమకు అన్యాయం జరుగుతుందని సీనియర్నర్సులు స్పష్టం చేస్తున్నారు. పైగా రాత పరీక్షల్లో రీసెంట్గా నర్సింగ్ కోర్సు పూర్తి చేసినోళ్లతో పోటీ పడలేమని సీనియర్నర్సులు చెబుతున్నారు. ఇలాంటి వారికి అకడమిక్ ఇయర్ఆధారంగా వెయిటేజీ ఇస్తే కాస్త మేలు జరుగుతుందని నర్సింగ్ సమితి ప్రెసిడెంట్ గోవర్ధన్ తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఏడాది నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే అకడమిక్ఇయర్వెయిటేజ్అవసరం రాదని చెప్పారు.
రెండు వెయిటేజీలు కష్టం..
వెయిటేజీ అంశంపై ఇప్పటికే మంత్రి హరీష్రావుతో పాటు మెడికల్ బోర్డు సెక్రటరీ కూడా నర్సులు రిక్వెస్ట్ చేశారు. కానీ రెండు రకాల వెయిటేజీలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రులలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లో పనిచేసే స్టాఫ్కు గరిష్టంగా 20 వెయిటేజీ మార్కులు ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిజేసే వారికి ప్రతీ ఆరు నెలలకు 2.5 మార్కులు, ఇతర ప్రాంతాలలో పనిచేస్తే రెండు మార్కులు చొప్పున పరిగణలోకి తీసుకుంటారు.