మసీదు కూల్చివేతకు ఆర్డర్ తీసుకువస్తా..

by Disha Web Desk 7 |
మసీదు కూల్చివేతకు ఆర్డర్ తీసుకువస్తా..
X

దిశ, తెలంగాణ బ్యూరో: శంషాబాద్ కేకే టౌన్ షిప్ గ్రీన్ అవెన్యూ వెంచర్‌లో కోర్టు ఆర్డర్, కలెక్టర్‌ ఆదేశాలను కాదని అక్రమ మసీదు నిర్మాణం మళ్ళీ ప్రారంభించారని, ఈ విషయంపై కోర్టుకు వెళ్లి మసీదు కూల్చివేతకు సంబంధించి ఆర్డర్ తీసుకువస్తానని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రీన్ అవెన్యూ వెంచర్ నిర్మాణం సమయంలోనే గుడి, మసీదు, చర్చి ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారని వివరించారు.

గుడి, మసీదు, చర్చి వెంచర్‌కు కొద్దీ దూరంలోనే ఉన్నాయని, దీంతో వెంచర్‌లో వద్దని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈ వెంచర్‌లోని అందరూ కలిసి మెలిసి ఉండాలనుకున్నారని తెలిపారు. కానీ స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేతలు అక్రమంగా మసీదు కట్టారని, కలెక్టర్ దృష్టికి ఆ విషయం వెళ్లిందని, దీంతో మున్సిపల్ పోలీసు సిబ్బంది వెళ్లి అక్రమంగా ఏర్పాటు చేసిన మసీదును కూల్చి వేశారని స్పష్టం చేశారు. మజ్లీస్, టీఆర్ఎస్ నేతలు కలెక్టర్‌ను బెదిరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ కాదని అక్రమ మసీదు నిర్మాణం మళ్ళి ప్రారంభించారని, ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు, పోలీస్ కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.


Next Story