- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘అదంతా ఫేక్’ కరీంనగర్ MP అభ్యర్థిపై ఏఐసీసీ కీలక ప్రకటన
దిశ, వెబ్డెస్క్: కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్రెడ్డి పేరు కన్ఫామ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పేరు ఏఐసీసీ ఖరారు చేసిందని.. ఇక అఫిషియల్గా అనౌన్స్ చేయడమే మిలిగి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్గా ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ కన్ఫామ్ చేసినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ అలర్ట్ అయ్యింది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ప్రవీణ్ రెడ్డి పేరు ఫిక్స్ అయినట్లు జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఖరారు చేశామన్నది అవాస్తమని తెలిపింది.
కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై తాము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ కాంగ్రెస్ 14 సీట్లకు అభ్యర్థులను అనౌన్స్ చేసింది. మిగిలిన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాలకు క్యాండిడేట్ల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, కరీంనగర్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉండటంతో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి సవాల్గా మారింది. మరో నాలుగు రోజుల్లో తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోవడం హాట్ టాపిక్గా మారింది.