- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎరువుల దుకాణాల్లో నిలువు దోపిడీ

X
దిశ, గుండాల : అడిగేవాడు లేకుంటే నాకెవరు అడ్డు అనే చందంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎరువుల దుకాణ యజమానులు ఆదివాసి ప్రజలను దోచుకుంటున్నారు. అయినా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. గుండాల, అల్లపల్లి మండలాల్లో పలు లైసెన్సుడు, నాన్ లైసెన్సుడు ఎరువుల షాపులు ఉన్నాయి. వీటిలో రైతు కొనుగోలు చేసే విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ బిల్లులు ఇవ్వడం లేదు. ఈ షాపులు వడ్డీ వ్యాపారులవి కావడంతో అప్పుగా ఎరువులు, పురుగు మందులు ఇచ్చి ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారు. దాంతో ఆదివాసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఎరువుల దుకాణాల్లో రైతులు మోసపోకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story