బోధమ్ పల్లిలో ట్రాక్టర్ బోల్తా...ఒకరు మృతి

by Disha Web Desk 15 |
బోధమ్ పల్లిలో ట్రాక్టర్ బోల్తా...ఒకరు మృతి
X

దిశ,బెజ్జుర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోధమ్ పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మోర్ల రాజేందర్ (22) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన పిడుగు వినోద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. చేనులో వ్యవసాయ పనుల్లో భాగంగా వెళ్లిన ట్రాక్టర్​ తిరిగి వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, వినోద్ కు తీవ్ర గాయాలు కావడంతో కలగదు నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కౌటాల సీఐ సాదిక్ పాషా, ఎస్సై ప్రవీణ్ కుమార్ సందర్శించారు వివరాలు సేకరించారు.



Next Story