- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పట్టు తప్పిన పట్టు ఇండస్ట్రీ

దిశ, ఉట్నూర్ : ఒక నాడు పట్టు ఇండ్రస్టీకి భారి డిమాండ్ ఉండేది. కాలానికి అనుగుణంగా పెను మార్పులు సంభవించి పట్టు పరిశ్రమ పూర్తిగా కొట్టుకుపోయింది. గతంలో పట్టు ఉన్న డిమాండ్ చూస్తే భారీ స్థాయిలో ఉండేది. రాను రాను నూతన పోకడలతో పట్టుతో తయారైన వస్తువుల విక్రయాలు తగ్గుముఖం పట్టడడంతో పట్టు పరిశ్రమ పట్టు కోల్పోయింది.
ఏజెన్సీలోని గిరిజన చిన్నకారు రైతులకు ఏడాది పాటు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో మండల కేంద్రంలోని పట్టు పరిశ్రమల ఏర్పాటుకు అప్పటి సర్కార్ 1983లో భీ`జం వేసింది. పట్టు పురుగుల పెంపకం, గూళ్ల ఉత్పత్తి, మల్బరి, దసళి పట్టు, పట్టు దారం తీయడం, టస్పర్ బట్టలు నేయడం వంటి యూనిట్లను సైతం ఏర్పాటు చేసి గిరిజనులకు ఆర్థికంగా ఎదగాలని ఏర్పాటు చేసినప్పటికి ప్రస్తుతం సమస్యలతో కోట్టుమిట్టాడుతుంది. ఈ ఇండస్ట్రీని సక్రమంగా చూసుకునే ఆఫీసర్లు లేకపోవడంతో ఈ ఇండస్ట్రీ మూత పడే దిశలో ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన రైతుల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రీను ఏర్పాటు చేశారు. రైతులకు జీవనోపాధి కల్పించేందుకు మల్బరి, దసళి తోటలను సాగు చేసేల ప్రోత్సహించారు. వీటితో పాటుగా పట్టు పురుగలు పెంపకం, పట్టుగూళ్ల ఉత్పత్తి పై దృష్టి సారించారు. పట్టుదారం తీయడం, పట్టుబట్టలు నేయడంలో గిరిజనులకు ట్రైనింగ్ కల్పిస్తూనే వారికి కావాల్సిన సహాయ, సహకారాలను ఐటీడీఏ ద్వారా అందించేది. ఆఫీసర్ల తగిన సలహాలు, సూచనలు చేస్తూ పట్టు ఇండస్ట్రీ రంగంలో రాణించేల తగు చర్యలు తీసుకున్నారు. కొన్నేళ్ల పాటుగా ఈ ఇండస్ట్రీ లాభాల్లో నడిచింది. పట్టు ఉత్పత్తిలో ఈ ఇండస్ట్రీ ఆశించిన మేరకు ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించేల చేసింది. ఆఫీసర్ల ట్రాన్సుఫార్లు, నిధులు సమస్యలు, పర్యవేక్షణ, సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇండస్ట్రీ పై తీవ్ర ప్రభావం చూపింది. నిర్వహణలో ఎదురైన ఇబ్బందులతో ఉత్పత్తులు తగ్గడంతో పాటుగా నష్టాలతో ఇండస్ట్రీకి కష్టమొచ్చింది.
సరైన పర్యవేక్షణ.. ఖాళీలతో ఇబ్బందులు..
ఉట్నూరులో ఏర్పాటు చేసిన పట్టు ఇండస్ట్రీను సమర్థవంతంగా నిర్వహించేల గతంలో ఈ ఇండస్ట్రీకి ఏడి సెరికల్చర్ ఆఫీసర్తో పాటుగా ఇండస్ట్రీ ముగ్గురు ఆఫీసర్లు, 6 ఆసిస్టెంట్ ఆఫీసర్లు, 14 మంది నిర్వహణ ఆఫీసర్లు, 18 మంది టెక్నికల్ ఆఫీసర్లు, 30 మంది కార్మికులు, ఇద్దరు అటెంటర్లు ఉండేవారు. పూర్తి స్థాయిలో ఆఫీసర్లు అందరూ ఉండడంతో ఈ ఇండస్ట్రీ సక్రమంగా నడిచేది. ఒక్కొక్కరుగా ఆఫీసర్లు ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ అయ్యారు. వారి స్థానాల్లో ఏ ఆఫీసర్లును నియమించలేదు. క్రమంగా ఆఫీసర్ల కొరత ఏర్పడింది. దీని వల్ల పర్యవేక్షణ తగ్గపోయింది.
హార్టికల్చర్ విలీనం..
ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేసిన సెరికల్చర్ 1983లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి 2015 వరకు ఇండస్ట్రీ నడుస్తూ వచ్చింది. తర్వాత సెరికల్చర్ ను హర్టికల్చర్ లో విలీనం చేశారు. 36 ఏకరాలలో విస్తీర్ణంలో ఉన్న పట్టు ఇండస్ట్రీను హర్టికల్చర్ లో విలీనం చేయడంతో ఐటీడీఏ ద్వారా నిధులు మంజూరు కావడం లేదు. తద్వారా సిబ్బంది కొరతతో పాటుగా పర్యవేక్షణ ఒరవడి ఇండస్ట్రీ మొక్కుబడిగా సాగుతుంది.
పూర్వ వైభవం తీసుకు రావాలి..
ఈ ఇండస్ట్రీ ఏర్పడిన సమయంలో గిరిజన సన్నకారు రైతులతో పాటుగా ఇతర జీవనోపాధికై ఆవకాశాలు బాగుండేవి. కాలనుకనుగుంగా ఇండస్ట్రీపై పట్టు కోల్పోవడంతో మూతపడింది. ఇండస్ట్రీపై సర్కార్ తో పాటుగా ఐటీడీఏ ఆఫీసర్లు దృష్టి సారించి పూర్వ వైభవం తీసుకు వచ్చి గిరిజనులకు ఉపాధి ఆవకాశాలు కల్పించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టి పెట్టాలి.. కుడిమెత తిరుపతి, తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్
పట్టు పరిశ్రమతో గతంలో అనేక మందికి ఉపాధి లబించేది. పూర్తి స్థాయిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో పట్టు పరిశ్రమ కాలగర్భంలో కలిసిపోయింది. దీనికి పున ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. పూర్తి స్థాయిలో అధికారులను నియమించాలి.