బాసర ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే గురువులు లేరని విద్యార్థుల ఆందోళన..

by Disha Web Desk 6 |
బాసర ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పే గురువులు లేరని విద్యార్థుల ఆందోళన..
X

దిశ,బాసర: నిర్మల్ జిల్లా చదువుల తల్లి క్షేత్రంలో విద్యార్థులకు చదువులు చెప్పే గురువులు లేరని బాసర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమకు తెలుగు, హిందీ, సాంఘిక శాస్త్రం(సోషల్) సబ్జెక్ట్ లలో ఉపాద్యాయులు లేరని, దాంతో త్రాగటానికి నీరు లేదని, బాత్రూంలు సరిగా లేవని, తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వి వాంట్ వాటర్, వి వాంట్ టీచర్స్ అని నినాదాలు చేస్తూ పాఠశాల అవరణలో శాంతియుతంగా ధర్నా చేశారు. ఎంఈఓ రావాలని ఎంఈఓ వచ్చి మా సమస్య పరిష్కరించే వరకు మా ఆందోళన విరమించబోమని విద్యార్థులు కూర్చున్నారు.


Next Story