డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తుల వెల్లువ..! మరి స్థలాలు ఇచ్చినవారి పరిస్థితి ఏంటి..?

by Dishanational1 |
డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తుల వెల్లువ..! మరి స్థలాలు ఇచ్చినవారి పరిస్థితి ఏంటి..?
X

దిశ, ముధోల్: భైంసా పట్టణంలోని 26 వార్డులలో డబల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభం కాగా బుధవారం వరకు కొనసాగనుంది. దరఖాస్తులు మొదలై రెండురోజు కాగా, ఇంకోరోజు మిగిలి ఉండగానే మంగళవారం వరకు 5425 అప్లికేషన్లు వచ్చాయి. బుధవారం ఇదే సగటున అప్లికేషన్లు వస్తే మరో 2000 పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముంది. మొత్తం దాదాపు 640 డబుల్ బెడ్రూమ్స్ నిర్మించగా దరఖాస్తులు మాత్రం వేలల్లో వస్తున్నాయి. ఎంపిక విధానంపై ఇంకా సరైన స్పష్టత లేక ప్రజలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ కి అప్లై చేసి, డబల్ బెడ్రూమ్ రాకపోయినా స్థలం ఉన్న వారికీ ఇంటినిర్మాణం నిమిత్తం అందించే మూడు లక్షల రూపాయల కొత్త ప్రభుత్వ స్కీమ్ కి అర్హులుగా ఉంటామా..! లేదా..! అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంద్రమ్మ ఇండ్ల స్థలాలు ఇచ్చినవారి పరిస్థితి ఏంటి..?

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకి ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇండ్ల స్థలాలను మంజూరు చేసింది. నిర్మాణాల కొరకు ప్రత్యేక అకౌంట్లలలో విడతలవారీగా నగదు కూడా జమచేసింది. అయితే పట్టణానికి చెందిన బోర్ర గణేష్ సమీపంలోఇందిరమ్మ ఇండ్లకి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేయగా, దాదాపు వందకుపైగా మంది ఇందిరమ్మ ఇండ్ల స్థలాలలో బేస్మెంట్ వరికు నిర్మాణాలు నిర్మించి, మళ్లీ నిధులు రాకపోవడంతో అలానేవేచి ఉంచారు. కాలక్రమేణా ప్రభుత్వాల మారుతూవుండడంతో ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలు కాస్త అలానే కుంటుపడిపోయాయి. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు పట్టణ సరిహద్దులలో ప్రభుత్వ స్థలాలను వెతకగా ఎక్కడ అనువైనస్థలం దొరకలేదు.

దీంతో గతంలో భైంసాపట్టణం బొర్రగణపతి సమీపాన ఇంద్రమ్మఇండ్లకు కేటాయించిన స్థలాలలోనే నిర్మాణాలు చేపట్టలని నిర్ణయించారు. వారు కట్టుకున్న బేస్మెంట్ లెవెల్, గోడల లెవల్ ఇండ్లను చెరిపేసే పరిస్థితి వచ్చింది. ఇంద్రమ్మ ఇండ్ల స్థలాల లబ్ధిదారులు, ఇంద్రమ్మ స్థలాలలో ఇంటినిర్మాణం కోసం బేస్మెంట్, గోడల వరకి నిర్మాణాలు చేపట్టిన ప్రజలు, ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ నిర్మించనివ్వబోమంటూ తొలుత ఆందోళన చేపట్టారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కలిగించుకుని డబల్ బెడ్రూమ్స్ కి అనువైన స్థలం ఇదేనని ఇందిరమ్మ ఇండ్లస్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనివ్వండంటూ స్థల ప్రజలని కోరారు. ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఇక్కడే డబల్ బెడ్రూమ్స్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎట్లాగో డబల్ బెడ్రూమ్ వస్తుందని ఇందిరమ్మ ఇండ్ల స్థల ప్రజలు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే అధికార సిబ్బందికి చెప్పగా...ఇంద్రమ్మ ఇళ్ల స్థలాలు ఉన్నవారి వివరాలను, వారి వారి స్థలాలలోని నిర్మాణాల ముందు లబ్ధిదారులు దిగిన ఫొటోలతో సహా అధికారులు నమోదు చేసుకున్నారు.

అయోమయంలో స్థలాలు ఇచ్చినవారి పరిస్థితి

ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తులనగానే నిర్మాణాల నిమిత్తం ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చిన ప్రజలు అయోమయంలో పడ్డారు. డబల్ బెడ్రూమ్స్ మొదట అనుకున్నట్లుగానే స్థలాలు ఇచ్చిన ప్రతిఒక్కరికీ హామీ ఇచ్చిన ప్రకారం డబల్ బెడ్రూమ్ వస్తాయా..! లేక రావా..! అంటూ గతంలో తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చినా ఇంకా అప్లై చేసుకోవడం ఉంటుందా..! అంటూ అయోమయంలో ఉన్నారు. చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో మొదట ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చిన ప్రజలకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.


Next Story