భైంసాలో ఘనంగా శోభయాత్ర

by Dishanational1 |
భైంసాలో ఘనంగా శోభయాత్ర
X

దిశ, బైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరామనవమి శోభయాత్రను భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, బీజేపి జిల్లా అద్యక్షురాలు రమాదేవి, బీజేపీ నాయకులు రామారావు పటేల్, మోహన్ రావ్ పటేల్, హిందువాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హాజరై ప్రారంభించారు. శోభయాత్ర పురాణ బజార్ గోశాల నుండి ప్రారంభమై బట్టి మీదుగా సాగి గాంధీ గంజ్, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా మీదుగా రామ్ లీలా మైదానం వరకు కొనసాగింది. భక్తులు శ్రీరాముని విగ్రాహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి... శోభయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భైంసా ఏఎస్పీ కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేశారు. శోభయాత్రలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




Next Story

Most Viewed