- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేద విద్యార్థులకు అండగా ఎస్బిఐ.. ఉచితంగా సైకిళ్ళ పంపిణీ

దిశ, బెజ్జూర్: పేద విద్యార్థులకు ఎస్బిఐ (SBI) అండగా నిలుస్తుందని రీజినల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా అన్నారు. బుధవారం మండలోని సలుగు పెళ్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్లో భాగంగా ఈ సైకిల్లను అందించినట్లు ఆయన తెలిపారు .మారుమూల గిరిజన గ్రామాన్ని ఎంచుకొని పేద విద్యార్థులకు వీటిని అందించడం జరిగిందని ఆయన తెలిపారు. విద్యార్థుల కోసం ఎస్బిఐ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులు గుర్తించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్బిఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు.
బేటి బచావో బేటి పడావో కేంద్ర ప్రభుత్వం లో భాగంగా పేద విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు అనంతరం బెజ్జూర్ ఎంఈఓ డాక్టర్ సునీత మాట్లాడుతూ ఎస్బిఐ సౌజన్యంతో మారుమూల గిరిజన గ్రామాలలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం గర్వకారణం అన్నారు. మరింత పేద విద్యార్థులకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టి వారికి అండగా ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థినిలకు సైకిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ కౌటాల బ్రాంచ్ మేనేజర్ విష్ణు, సిబ్బంది సంతోష్, నరేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.