శిక్షణ నందు సమయపాలన తప్పనిసరి : జిల్లా ఎస్పీ

by Disha Web Desk 23 |
శిక్షణ నందు సమయపాలన తప్పనిసరి :  జిల్లా ఎస్పీ
X

దిశ,ఆదిలాబాద్ : కానిస్టేబుల్ గా శిక్షణ పొందే వారికి సమయపాలన ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం శిక్షణ కానిస్టేబుల్ లకు సూచించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన 255 మంది శిక్షణ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబులళ్లు ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానాన్ని పరిశీలించిన ఆయన పలు రకాల ఆయుధాలను వాటి సామర్థ్యం, వినియోగించే పద్ధతి తదితర అంశాలపై కానిస్టేబుల్ లకు సవివరంగా వివరించారు.

అదేవిధంగా ఫైరింగ్ చేసే పద్ధతులు, ఎటువంటి అపాయం కలగకుండా ఉంటూ శత్రువులను మట్టుపెట్టే అంశాలపై అవగాహన కల్పించారు.ఆయుధాలపై పూర్తి పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని తెలియజేశారు. ఫైరింగ్ లో మెలకువలను శిక్షణ కానిస్టేబుళ్లకు నూతన పద్ధతులను, మెళకువలను ఉపయోగించడం వల్ల ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించి, ఫైరింగ్ చేయవచ్చన్నారు.అనంతరం శిక్షణ కానిస్టేబుళ్లకు అందజేస్తున్న సదుపాయాలను, లోటుపాట్లను శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ అదనపు ఎస్పీ సి సమైయ్ జాన్ రావు ను అడిగి తెలుసుకున్నారు.ఇందులో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎన్ రాకేశ్, పి గోపికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed