ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
X

దిశ, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పురపాలక సంఘ పరిధిలోని ఇటిక్యాలకు చెందిన మాదాసు రమేష్ (46) అనే వ్యక్తి క్రిమిసంహారక మందు తాగి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత కొంత కాలంగా ఆటో ట్రాలీ నడుపుతున్న అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఆ బాధను పట్టలేక ఈనెల 24న ఇంటి వద్ద క్రిమిసంహారక మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed