పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రిడ్ కార్మికుల ధర్నా

by Dishanational1 |
పెండింగ్ వేతనాలు చెల్లించాలని గ్రిడ్ కార్మికుల ధర్నా
X

దిశ, బెల్లంపల్లి: పెండింగ్ వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా బెల్లంపల్లి డివిజన్ లో గ్రామాల్లో మిషన్ భగీరథ శాఖలో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని వాపోయారు. చాలీచాలని జీతాలతో తాము పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. తమ వేతనాల విషయమే జిల్లా కలెక్టర్, బెల్లంపల్లి ఆర్డీవో వెంటనే స్పందించి సంబంధిత వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తాము చేపట్టబోయే ఆందోళనకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed