'ఒక్క అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దు'

by Disha Web Desk 13 |
ఒక్క అంగుళం కూడా అటవీ భూమి ఆక్రమణకు గురికావొద్దు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పోడు భూముల సమస్య పరిష్కారం తర్వాత.. ఒక్క అంగుళం అటవీ భూమి ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే లు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్, ఐటీడీఏ పీవో, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.


పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 140 విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story