రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |   ( Updated:2023-06-15 14:14:52.0  )
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
X

దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని ముత్తుగూడెం ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా లారీని ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తిరువూరు పట్టణం రాజుపేట కి చెందిన ఇందుపల్లి సత్య వర్ధన్ (45) కొత్తగూడెం నుండి విజయవాడ వైపు వెళ్తున్న లారీని వెనక భాగంలో ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వీఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story