పోలీస్ కమాండ్ కంట్రోల్ కొత్త భవనంలో చోరీ

by Dishanational1 |
పోలీస్ కమాండ్ కంట్రోల్ కొత్త భవనంలో చోరీ
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ లో నూతనంగా నిర్మించిన పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగిందని సమాచారం. ఈ సంఘటనలో 10 టేకు తలుపులు, 14 ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు, శానిటేషన్ పరికరాలు చోరీకి గురయ్యాయి. భవన నిర్మాణ కాంట్రాక్టర్ కంకణాల పద్మారెడ్డి ఈ ఘటనపై బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్ స్పెక్టర్ టి శంకరయ్యకు ఫిర్యాదు చేశారు. 2011లో సుమారుగా రూ. 50 లక్షలతో భవనాన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు గడిచినప్పటికీ ఈ భవనంను పోలీస్ శాఖ ఆధీనంలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఈ భవనంలో ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అవాసనంగా మారింది. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed