ఇక స్థానిక సమరమే.. జడ్పీటీసీ,సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్

by Aamani |
ఇక స్థానిక సమరమే.. జడ్పీటీసీ,సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
X

దిశ, ఆసిఫాబాద్ : ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే జోష్ తో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మళ్ళీ ఐదేళ్ల వరకు ఎన్నికలు ఉండవని భావిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మున్సిపాలిటీ. సహకార సంఘాల ఎన్నికలు కూడా పూర్తవుతాయి. అంతకంటే ముందే జరిగే గ్రామ పంచాయతీ.జిల్లా పరిషత్ ఎన్నికలను కాంగ్రెస్ పక్కాగా ప్లాన్ చేస్తోంది. కాగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ చేరారు.వీళ్లలో చాలామంది పాత కాంగ్రెస్ నాయకులతో పాటు కొత్తగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన నాయకులు ఉన్నారు. వలస నేతల. కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్ల మధ్య స్థానిక ఎన్నికలో విభేదాలు తలెత్తకుండా ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నారు. పంచాయతీ.జడ్పీటీసీ ఎన్నికలకు కలిపి ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ప్రత్యర్థులకు ఛాన్స్ ఉండదని పైగా లోకల్ బాడీలను హస్తగతం చేసుకునేందుకు మార్గం సులువుగా ఉంటుందని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరం పై పడింది. జూన్ లో ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల మెటీరియల్ అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 4.56.309 మంది ఓటర్లు. 335 గ్రామ పంచాయతీలు. 15 మండలాలు. 2874 వార్డులు. ఉన్నాయి. ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త చట్టం ప్రకారం రెండు టెర్మినల్ వరకు ఒకటే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మొదటి టర్మ్ కు సంబంధించి ఫిబ్రవరిలో పంచాయతీల పాలన ముగియగా. జూలైలో జిల్లా పరిషత్ లో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. దీంతో జూన్ లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది.

డైరెక్ట్ గా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్..

డైరెక్ట్ గా ఎన్నికల నోటిఫికేషన్ పంచాయతీ. వార్డులు. మొదలు జడ్పీ చైర్మన్ స్థానం వరకు ఇప్పుడున్న రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. డైరెక్ట్ గా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి. వారం పదిరోజుల్లో ఎన్నికల ప్రచారం. నామినేషన్ల ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీటీసీ. జడ్పీసీటీల ఎన్నికలు జరిపి.. కొద్ది రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలోని ఆయా పార్టీల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల పై ఫోకస్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సారి జిల్లాలో స్థానిక సంస్థల పోరు రసవత్తరం కానుంది.



Next Story

Most Viewed