కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత

by Disha Web Desk 9 |
కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 11 మంది విద్యార్థినులకు అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో దాదాపు 11 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థుల అశ్వస్థతపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి.. ఏకంగా 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed