- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అండర్-19 క్రికెట్ జట్టుకు ఏలేటి శృంజిత్ రెడ్డి ఎంపిక
by Disha Web Desk 20 |
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అండర్ -19 క్రికెట్ కు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కుమారుడు ఏలేటి శృంజిత్ రెడ్డి ఎంపికయ్యారు. అతి చిన్న వయసులోనే క్రికెట్లో తన ప్రతిభను కనబరిచి గతంలో అండర్ 14, అండర్ 16 కు కెప్టెన్ గా వ్యవహరించారు. ఇప్పుడు 16 ఏళ్ల వయసులోనే అండర్ 19 కు సెలెక్ట్ అయి అందరి దృష్టిని ఆకర్షించారు.
16 ఏళ్ల వయసులోనే అండర్ 19 కు సెలెక్ట్ కావడం విశేషం. ఆటలో ప్రతిభ ఉన్న అతి కొద్ది మందికే ఇలాంటి అరుదైన అవకాశం దక్కుతుంది. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువతో ఆటపై పట్టు సాధించారు. క్రికెట్ లో తన అద్భుతమైన ప్రతిభను గుర్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు అండర్ 19 టీమ్ కు ఎంపిక చేసింది. ఈరోజే అండర్ 19 టూర్ కు ఏలేటి శృంజిత్ రెడ్డి బయలు దేరనున్నారు.
Next Story