- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాత్రి పదిన్నరకు వ్యాపార సముదాయాలు మూసివేయాలి : సీఐ బి.సునీల్ కుమార్

దిశ, ఆదిలాబాద్ : పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపడంలో భాగంగా పట్టణంలోని వ్యాపార సముదాయాల యజమానులు రాత్రి 10:30కు వారి దుకానాలను మూసివేయాలని 1 టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. గత 3 రోజుల్లో రాత్రి పదిన్నర తర్వాత తెరచి ఉంచిన వ్యాపార సముదాయాల యజమానులకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాత్రి పదిన్నర తర్వాత వ్యాపార సముదాయాలను మూసివేయాలనే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా పట్టణంలో పోలీసు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు వ్యాపార సముదాయాల యజమానులు నిర్లక్ష్యం వహిస్తూ దుకాణాలను తెరిచి ఉండడంతో వారికి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించామన్నారు. తెరచి ఉంచిన వ్యాపార సముదాయాలలో ముఖ్యంగా పాన్ షాప్, టీ షాప్ లు, కిరాణా షాప్, హోటల్స్, పలు రకాల వ్యాపార సంస్థల యజమానులు ఉన్నట్లు తెలిపారు. అందులోని పది మంది పై 10 కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.