- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి చేసుకోమన్నారని యువకుడి ఆత్మహత్య
దిశ, లక్షెట్టిపేట : పెళ్లి చేసుకోవాలని తండ్రి మందలించినందుకు అవమానంగా భావించిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు శ్రీనివాస్ (22) అనే యువకుడు లక్షెట్టిపేట లోని ఓ బట్టల దుకాణంలో వర్కర్ గా పని చేస్తున్నాడు.
మృతునికి పెళ్లి కాలేదు. తీరిక సమయాల్లో ఎప్పుడూ సెల్ ఫోన్లో వీడియోలు చూస్తున్న ఆ యువకుడిని గమనించిన తండ్రి పెళ్లి చేసుకునేది ఉందా? ఎప్పుడూ వీడియోలు చూడడమేనా అని మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన యువకుడు ఈనెల 25న ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని లక్షెట్టిపేట ఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.